JW subtitle extractor

చనిపోయిన తర్వాత ఏమౌతుంది?

Video Other languages Share text Share link Show times

మనిషి చనిపోయాక అతని ఆత్మ బ్రతికే ఉంటుందని
దాదాపు అన్ని మతాలు చెప్తున్నాయి.
కానీ బైబిలు ఏం చెప్తుంది?
దేవుడు మొదటి మనిషైన ఆదామును మట్టినుండి సృష్టించాడు,
నిత్యం జీవించివుండే అవకాశాన్ని ఇచ్చాడు.
కానీ అతను కావాలనే దేవుని మాట వినలేదు.
అందుకే అతను తిరిగి మట్టిలో కలిసిపోతాడని దేవుడు చెప్పాడు.
దానర్థం ఉనికిలో లేకుండా పోతాడని.
ఆదాము తర్వాత చనిపోయినవాళ్ల విషయమేమిటి?
తన స్నేహితుడైన లాజరు చనిపోయాడని యేసుకు తెలిసినప్పుడు
లాజరు పరలోకానికి వెళ్లాడని యేసు చెప్పలేదు.
“మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు” అని అన్నాడు.
ఆ మాటలకు అర్థమేమిటి?
గాఢనిద్రలో ఉన్న వ్యక్తి ఎలాగైతే ఏమీ చేయలేడో,
తన చుట్టూ జరుగుతున్నవి తెలుసుకోలేడో,
అదేవిధంగా చనిపోయినవాళ్లకు కూడా ఏమీ తెలీదు.
అంతేకాదు, గాఢ నిద్రలో ఉన్న వ్యక్తిని ఎలాగైతే లేపవచ్చో,
చనిపోయినవాళ్లను కూడా తిరిగి బ్రతికించవచ్చని బైబిలు చెప్తుంది.
తన స్నేహితుడైన లాజరును యేసు అలాగే బ్రతికించాడు.
అప్పటికే లాజరు చనిపోయి నాలుగు రోజులైంది.
చనిపోయిన లాజరు ఆత్మ పరలోకానికి వెళ్లుంటే,
యేసు అతన్ని పరలోకం నుండి బలవంతంగా రప్పించి
భూమ్మీద జీవించేలా చేశాడా?
లేదు.
సమాధిలో నిద్రిస్తున్న లాజరుకు, యేసు మళ్లీ జీవాన్ని ఇచ్చి
అతని కుటుంబసభ్యుల్ని మళ్లీ కలుసుకునేలా చేశాడు.
చనిపోయినవాళ్లలో చాలామంది లాజరులాగే
మళ్లీ బ్రతికే కాలం వస్తుందని బైబిలు మాటిస్తుంది.
ఆ అద్భుతమైన నిరీక్షణ గురించి చెప్తూ యేసు ఇలా అన్నాడు:
“నా మీద విశ్వాసం చూపించే వ్యక్తి చనిపోయినా మళ్లీ బ్రతుకుతాడు.”
ఇంతకీ ‘ఎవరెవరు మళ్లీ బ్రతుకుతారు?’
‘పునరుత్థాన ఏర్పాటు యెహోవా గురించి ఏమి తెలియజేస్తుంది?’
అనే సందేహం మీకు రావచ్చు.
వీటికి జవాబులు దేవుడు చెబుతున్న మంచివార్త!
బ్రోషురులోని
6వ పాఠంలో ఉన్నాయి.
jw.org వెబ్‌సైట్‌ నుండి మీరు దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
మీతో బైబిలు విషయాలు చర్చించడానికి యెహోవాసాక్షులు ఇష్టపడతారు.
మీకు కూడా ఇష్టమైతే, ఆన్‌లైన్‌లో మీ వివరాలు నింపండి.
మీ ప్రాంతంలో ఉంటున్న ఓ యెహోవాసాక్షి
మీకు అనుకూలమైన సమయంలో, స్థలంలో బైబిలు గురించి చర్చిస్తారు.